విఘ్న నాయకునకి అవిఘ్నాలు ఎన్నో..?

అవిఘ్నాలు ఎన్నో..? మనం చేసే పనుల్లో అవిఘ్నాలు ఎదురవకూడదని అందరూ విఘ్నేశ్వరుడిని పూజిస్తుంటాం... అయితే ఆ విఘ్న నాధునికే మన పోలీసులు ఆంక్షల పేరుతో అవిఘ్నాలు కల్పిస్తున్నారు. ఎప్పటిలానే హిందూ పండగలపై పోలీసుల ఆంక్షలు పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు మరోమారు వినిపిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా నిర్వహించే నవరాత్రులు, నిమజ్జనానిని సంబంధించిన ఏర్పాట్లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ జీహెచ్ఎమ్నీ, హెచ్ఎమ్డబ్ల్యూఎస్ఎస్ఓ, టీఎస్ ఎస్డీసీఎల్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక శాఖ, ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసు, లా అండ్ ఆర్డర్ పోలీసు, డీఎమ్ హెచ్ఓ, ఇరిగేషన్, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సెప్టెంబరు 2వ వినాయక పండుగ, 12న నిమజ్జనం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకునేందుకు మార్గదర్శకాల పేరుతో పలు ఆంక్షలు విధించారు. గణేష్ మండపాల నిర్వహాకులు అనుమతి కోసం www.cyberabadpolice.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. -మండపాలు ఏర్పాటు చేసే వారు స్థల యజమానుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి. మండపం ట్రాఫిక్ లేదా ప్రజలకు ఇబ్బందిగా ఉండొద్దు. -మండపాల వద్ద విద్యుత్ షాక్లు ఏర్పడకుండా నాణ్యతతో కూడిన వైరింగ్ ఏర్పాటు చేసుకోవాలి. -ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి. - బాణాసంచా పేల్చడం నిషేదం.. -లౌడ్ స్పీకర్ల ఏర్పాటుకు స్థానిక వీఎస్ నుంచి అనుమతి తీసుకోవాలి. -డిజే స్పీకర్స్కు అనుమతి లేదు. బాక్స్ టైప్ స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి 10 నుంచి ఉ.6 గంటల వరకు స్పీకర్ వాడకం నిషేదం. -మండపాల వద్ద రాత్రి సమయాల్లో ముగ్గురు వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి. -భవనాల సెల్లార్లలో ఏర్పాటు చేసే మండపాలకు, ఉరేగింపులకు పోలీసు క్లియరెన్స్ తీసుకోవాలి. -నిమజ్జనం జరిగే ప్రతి చెరువు వద్ద నిష్ణాణుతులైన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తాం. -పండుగ పేరుతో ఎవరు బలవంతంగా చందాలు, హస్తాలు వసేలు చేయొద్దు. -నిర్వాహకులు, కాలనీ పెద్దలు, సామాజిక సేవకులు, వీస్ కమిటీ సభ్యులు పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయపర్చుకుని ప్రశాంత వాతావరణాన్నికి కృషి చేయాలి. -సైబరాబాద్ పరిధిలో 29 చెరువుల్లో నిమజ్జనం జరుగుతుంది. ఇవి జీహెచ్ఎమసీ పరిధిలో21, మేడ్చల్ కలెక్టరేట్ పరిధిలో-2, రంగారెడ్డి కలెక్టరేట్ పరిధిలో-6 చెరువులు వస్తాయి. -సెప్టెంబరు 12న జరిగే నిమజ్జనం కోసం 54 స్టాటిక్ క్రేన్స్, 22 మొబైల్ క్రేన్స్లను ఏర్పాటు చేస్తున్నాం. -జిల్లా వైద్యాధికారులు అంబులెన్స్ సర్వీసులు, మెడికల్ క్యాంపులను నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. -టూరిజం శాఖ అధికారులు బోట్లు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతారు. -అనుమతి లేకుండా విద్యుత్ సరఫరాను చేసుకునే వారిని టీఎససీపీడీసీఎల్ అధికారులు గుర్తించి జరిమానాలు విధిస్తారు. విద్యుత్ అంతరాయం లేకుండా పని చేస్తారు. -ఆర్ అండ్ బీ శాఖ అధికారులు నిమజ్జనానినిక అవసరమైయ్యే సదుపాయాలను కల్పిస్తారు. బ్యారికేడ్లను అందిస్తారు. -నిమజ్జనం ప్రాంతం, నిమజ్జనంక వెళ్ళే మార్గంలో ఉండే అడ్డంకులను తొలగించడం, నిమజ్జనం దగ్గర ప్లాట్ ఫాంలను నిర్మించడాన్ని జీహెచ్ఎమ్సీ కమిషనర్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. -అగ్నిమాపక శాఖ అధికారులు 36 పోర్టబుల్ ఫైర్ బ్రిగేడ్స్, 21 ఫైర్ ఇంజిన్లను అందుబాటులో పెడతారు. 


Popular posts